ఏపీలో మండుటెండలు..
ఓవైపు వర్షాలు కురుస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ శనివారం (మే 30 వరకు) వరకు ఏపీలో ఈ ఉధృతి కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయంటే..
45°C - 46°C : ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం.
42°C - 44°C : విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, నెల్లూరు.
40°C - 42°C : శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాలు.
26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది.