ఇవాళ్టి నుండే మండిపోనున్న ఎండలు..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలంగాణలో ఎండలు మండిపోతాయని హెచ్చరించింది... ఆసక్తికర విషయం ఏంటంటే వెదర్ మ్యాన్ ఏప్రిల్ 12 నుండి ఎండలు మండిపోతాయంటే వాతావరణ శాఖ ఇవాళ్టి (శుక్రవారం) నుండి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయంటోంది. ఈ నాలుగురోజులు (ఏప్రిల్ 10,11,12,13) ఏకంగా 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటోంది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్,మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక ఎండలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది... ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాల్లో కూడా 36 నుండి 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయట... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.