గుట్టుగా హలీం డోర్ డెలివరీ... తయారీకేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

First Published May 9, 2020, 8:14 PM IST

కరోనా ఆంక్షలు అమల్లో వున్నా పట్టించుకోకుండా హలీం అక్రమ విక్రయాలను చేపడుతున్న ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కరీంనగర్: రంజాన్ ఉపవాస దీక్షలను ఆసరాగా చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా హరీస్, హలీంలను తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం నాడు దాడులు నిర్వహించారు. కరీంనగర్ లోని ఫతేపురా, గోదాంగడ్డ ప్రాంతాల్లో అక్రమంగా హలీం, హరీస్ లను తయారు చేస్తున్న నలుగురు పై సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి.
undefined
ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.రంజాన్ ఉపవాస దీక్షలను ఆసరాగా చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా హరీస్, హలీం లను తయారు చేసి, డోర్ డెలివరీ చేస్తున్న నలుగురు నిందితులు విచారణలో పలు విషయాలను వెల్లడించారు.కరీంనగర్లోని ఫతేపురా ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖదీర్(59), అతని కుమారులు ముదస్సర్( 27), అబ్రత్కా వలి( 21) రంజాన్ ఉపవాస ఉపవాస దీక్షలు ప్రారంభం నుండి రహస్యంగా హరీస్ లను తయారు చేస్తున్నారు. ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా చాలా మంది వీటిని అల్పాహారంగా స్వీకరిస్తున్నారు.
undefined
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా లాక్ డౌన్, రాత్రి వేళల్లో కర్ఫ్యూ లను పగడ్బంధీగా అమలు చేస్తున్న విషయం విదితమే.దీంతో బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో వారు ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా స్వీకరించే పదార్థాలను ఫోన్ల ద్వారా ఆర్డర్లను తీసుకొని డోర్ డెలివరీ చేస్తున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ విభాగం పోలీసులు రహస్యంగా హలీం, హరీస్ లను తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వీరు తయారు చేస్తున్న కేంద్రంపై దాడి నిర్వహించిన సందర్భంలో 75 కిలోల మాంసం కీమా, హరీస్ తయారు కోసం వినియోగించే ఇతర సరుకులు, సామాగ్రిని స్వాధీనం చేసుకొని సంబంధిత వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
undefined
అలాగే గోదాంగడ్డ ప్రాంతంలోని ఒక ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో రహస్యంగా హలీం ను తయారు చేస్తున్న కేంద్రం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కరీంనగర్లోని సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఫరీద్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత సంబంధిత బ్లూ కోల్ట్స్, పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు నిర్వహకుడు పరిధిపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
undefined
నిర్వాహకుడు షేక్ ఫరీద్ గత వారం రోజుల నుండి దాదాపు 150 మందికి ఫోన్ కాల్స్ ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తూ డోర్ డెలివరీ చేసినట్లు అంగీకరించాడు. ఈ కేంద్రం పై దాడి నిర్వహించిన సందర్భంలో మూడు కిలోల మటన్ కీమా, వంట సామాగ్రి, ఫోన్ పై ఆర్డర్లను చేసినవారు ఈ కేంద్రం వద్ద అందజేసిన టిఫిన్ బాక్సులతో పాటుగా వంట సామాగ్రి, ఉపయోగించే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ విభాగం ఇన్స్పెక్టర్లు ఆర్ ప్రకాష్, శశిధర్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ నరసయ్య లతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.
undefined
click me!