జానారెడ్డితో మరోసారి సంప్రదింపులు, ఢిల్లీకి జీవన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్ష్

First Published Dec 29, 2020, 1:35 PM IST

టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.ఈ నెలాఖరు నాటికి కొత్త నేతను ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటన నేపథ్యంలో కొత్త నేత ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో పార్టీ అధిష్టానం మరోసారి సంప్రదింపులు జరుపుతోంది. ఈ నెలాఖరు వరకు టీపీసీసీ చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే రాహుల్ గాంధీ ఇటలీ పర్యటనలో ఉన్నందున టీపీసీసీ చీఫ్ ప్రకటన విషయం ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
undefined
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీకి ఐదుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ ఇచ్చాడు. ఈ ఐదుగురు పేర్లలో ఇద్దరి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తోందని ప్రచారం సాగుతోంది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కల మధ్య పోటీ నెలకొందని ప్రచారం సాగుతోంది.
undefined
రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని ఇస్తే తాను పార్టీని వీడుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు కాంగ్రెస్ సీనియర్లు కొందరు అదే దారిలో ప్రయాణించే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.
undefined
ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరోసారి పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జివన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో జీవన్ రెడ్డి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకొంది. మాజీ ఎంపీ మధు యాష్కీ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తన అభిప్రాయాలను తెలుసుకొంది.
undefined
మాజీ మంత్రి జానారెడ్డి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టీపీసీసీ చీఫ్ విషయంలో అడిగి తెలుసుకొందని సమాచారం. గతంలో కూడ జానారెడ్డి అభిప్రాయాన్ని పార్టీ నాయకులు తీసుకొన్నారు. మరోవైపు మర్రి శశిధర్ రెడ్డి పేరును టీపీసీసీ చీఫ్ పదవి కోసం పార్టీ అధిష్టానంలో కొందరు సిఫారసు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.
undefined
టీపీసీసీ రేసులో తన పేరు లేకపోవడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కకుండా సీనియర్లు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.
undefined
ఠాగూర్ అభిప్రాయ సేకరణ సందర్భంగా వ్యవహరించిన తీరును కొందరు బహిరంగంగానే తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇటీవల వీహెచ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది.
undefined
click me!