టీ బీజేపీలో భారీ మార్పులు.. కేంద్ర మంత్రిగా బండి సంజయ్!.. మరి ఈటల పరిస్థితేమిటి..?

First Published Jun 29, 2023, 2:25 PM IST

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు  ముందుకు వేస్తున్న బీజేపీ అధినాయకత్వానికి.. రాష్ట్ర పార్టీ ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలోనే టీ బీజేపీలో నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టే  దిశగా పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తుంది. 
 

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు  ముందుకు వేస్తున్న బీజేపీ అధినాయకత్వానికి.. రాష్ట్ర పార్టీ ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలోనే టీ బీజేపీలో నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టే  దిశగా పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తుంది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయకపోవడం, పూర్తిగా హిందూత్వ అజెండాపైనే ఆధారపడటం, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. నేపథ్యంలో రాష్ట్ర పార్టీ‌ నేతలు కొందరు బహిరంగంగానే వారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ వీడనున్నారనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. ఈ పరిణామాలతో పార్టీలో బండి సంజయ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. 
 

Latest Videos


ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. ఇటీవల రాష్ట్ర నేతల ఈటల రాజేందర్, కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపింది. వారి అభిప్రాయాలను తీసుకుంది. అలాగే రాష్ట్రానికే చెందిన సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా బీజేపీ అధిష్టానం చర్చలు జరిపింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై వారితో చర్చలు జరిపారు.

etela-komati

ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను మార్చాలనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చినట్టుగా  సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్‌ను మారుస్తున్నారనే వార్తలను తరుణ్ చుగ్ వంటి నేతలు ఖండించినప్పటికీ.. బీజేపీ అధిష్టానం ఆ దిశలో ప్రయత్నాలు  చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఇటీవల ఓ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను బీజేపీ కార్యకర్తనని, జేపీ నడ్డా ఒక ఫోన్ చేసి పదవి నుంచి తప్పుకోమంటే తప్పుకోవడానికి సిద్దంగా ఉంటానని కామెంట్ చేశారు.  

ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో సంస్థగత మార్పులపై ఫోకస్ చేసిన బీజేపీ నాయకత్వం.. ప్రధాని మోదీ నివాసంలో సుధీర్ఘ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణ గురించి చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కేబినెట్ విస్తరణకు మోదీ ఒకే చెబితే.. బండి సంజయ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సీనియర్ రాజకీయ నేతగా ఉన్న ఈటల రాజేందర్‌కు పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించాలనే బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి పార్టీ  రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ  లేకుండా పోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుడికి కాకుండా.. చాలా కాలంగా బీజేపీలోనే ఉన్న వ్యక్తికే ఆ పదవి అప్పగించనున్నట్టుగా  సమాచారం. 
 

click me!