2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాజీ ఎపీ బోయినిపల్లి వినోద్ అభ్యర్థన మేరకు టిఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్) లో చేరానని ఆరేపల్లి మోహన్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు హుజురాబాద్, మునుగోడు బై ఎలక్షన్స్, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసానని అన్నారు. మానుకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవర్తన, పనితీరు బాగాలేదని అదిష్టానానికి చెప్పానే తప్ప పార్టీకి నష్టం చేసేలా ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు.కానీ తనకు సరయిన ప్రాధాన్యత దక్కకపోవడం, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో పార్టీలో కొనసాగలేకపోతున్నానని తన రాజీనామా లేఖలో మోహన్ పేర్కొన్నారు.