Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వెదర్.. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్

Published : Sep 07, 2026, 08:52 AM IST

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సహా 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

PREV
15
ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో వెదర్ వాతావరణం సడన్‌గా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో పాటు, అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది. దీనికి తోడు ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల గాలిలో వేగం విపరీతంగా పెరిగింది.

25
హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉండే జిల్లాల ప్రజలు రాబోయే 48 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. వాతావరణ శాఖ మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ఆరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు రోడ్లపై ఉన్న చెట్లను, కరెంట్ స్తంభాలను కూల్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా ఉండాలి.

35
మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. అక్కడ పరిస్థితి ఏంటి?

కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం గట్టిగానే ఉండేలా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. వర్షం పడే సమయంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరంగా బయట తిరగొద్దని అధికారులు సూచిస్తున్నారు.

45
ఏపీలోనూ వర్షాలు. ఈదురుగాలుల హోరు

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వాతావరణం కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఒకవైపు చినుకులు పడుతూనే, మరోవైపు ఉక్కపోత, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల వల్ల ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

55
రాయలసీమలో మబ్బుల వాతావరణం

రాయలసీమ వ్యాప్తంగా వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉదయాన్నే చూస్తే ఎండగా, వాతావరణం పొడిగా అనిపించినా.. మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి డార్క్ క్లైమేట్ వచ్చేస్తుంది. ఉరుములు, మెరుపులతో వాన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories