హైదరాబాద్ : భారతరత్న, బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు సర్వం సిద్దమైంది, సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ వేడుకలకు ముఖ్య అతిథిగా బాబాసాహెబ్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్ విచ్చేశారు. ఆయనను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా స్వాగతించారు.