‘గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ మీద, ముఖ్యంగా నా మీద కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు పచారం చేస్తున్నాయి. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. సుఖేష్ ఎవరో నాకు తెలియదు. ఆయనతో నాకేంటి పని. వాస్తవాలు పట్టించుకోకుండా.. అత్యుత్సాహంతో కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్ల విషయంలోనూ ఇలాగే చేశాయి. తరువాత నోరు మూసుకున్నాయి. ఇప్పుడు క్రిమినల్ అయిన సుఖేష్ ను పావుగా వాడుకుంటున్నాయి. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయి. దమ్ముంటే, నిజాయితీ గా ఉంటే నా ఈ వివరణకు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి..’ అంటూ ప్రకటన చేశారు.