Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?

Published : Sep 19, 2026, 10:13 AM ISTUpdated : Sep 19, 2026, 10:39 AM IST

పెరిగిన రీఛార్జ్ రేట్లతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పబోతోంది. టెలికాం కంపెనీలు చెల్లించే పన్నులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది… దీంతో రీచార్జ్ ధరలు తగ్గనున్నాయి.

PREV
14
మొబైల్ రీఛార్జ్ రేట్ల తగ్గుతాయా?

భారీగా పెరిగిన మొబైల్ రీఛార్జ్ రేట్లతో జేబులు ఖాళీ చేసుకుంటున్న ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ప్లాన్ రెడీ చేసింది. రాబోయే రోజుల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా యూజర్ల నెలవారీ రీఛార్జ్ ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి కట్టే పన్నులను తగ్గించాలని సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

టెలికాం కంపెనీలపై పన్ను భారం తగ్గడం వల్ల నేరుగా ప్రజలకే లాభం చేకూరుతుంది. కేంద్రం టెలికాం మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ సమాచారం ప్రకారం.. సామాన్యులకు మొబైల్ సేవలను చౌకగా అందించేందుకు ప్రభుత్వం అత్యంత కీలకమైన రెండు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది.

24
ట్రాయ్ సంచలన నిర్ణయం

మొదటి విషయం ఏంటంటే... ప్రస్తుతం టెలికాం కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో 8 శాతాన్ని లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ వాడుక ఛార్జీల కింద ప్రభుత్వానికి కడుతున్నాయి. ఈ 8 శాతం పన్నును 3 నుంచి 4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు అధికారిక వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రజలపై భారం తగ్గించేందుకే ఈ స్థాయిలో పన్నుల్లో కోత పెడుతున్నారు.

రెండో విషయం… టెలికాం కంపెనీలు కట్టే ఈ 8 శాతం పన్నులో 5 శాతం గ్రామీణ ఇంటర్నెట్ సదుపాయాల కోసం వెళ్తుంది. ఈ ఫండ్‌లో ఇప్పటికే చాలా డబ్బు జమైంది. అందుకే రాబోయే కొన్నేళ్ల పాటు ఈ 5 శాతం పన్ను వసూలును నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

34
ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏంటి?

గత జులై నెలలో టెలికాం కంపెనీలు రీఛార్జ్ రేట్లను 15 నుంచి 25 శాతం వరకు పెంచేశాయి. దీంతో 28, 56, 84 రోజుల వాలిడిటీ ఉండే పాపులర్ ప్లాన్లు చాలా కాస్ట్‌లీ అయిపోయాయి. ఈ ధరల పెంపు వల్ల గ్రామీణ ప్రజలు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలామంది రీఛార్జ్ చేయడమే మానేశారు లేదా సిమ్ కార్డులు తీసి పక్కన పెట్టేశారు. దీంతో పార్లమెంట్ నుంచి సోషల్ మీడియా వరకు దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అందుకే ఇప్పుడు ట్రాయ్, టెలికాం కంపెనీలతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

44
ప్రజలకు కలిగే లాభం ఏంటి?

ఒకవేళ ప్రభుత్వం పన్ను తగ్గిస్తే, టెలికాం కంపెనీలు ఇప్పుడున్న ప్లాన్ల ధరలను 10 నుంచి 15 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం 299 రూపాయలుగా ఉన్న నెలవారీ ప్లాన్ ధర 250 నుంచి 260 రూపాయలకు తగ్గొచ్చు. వార్షిక ప్లాన్లు వేసుకుంటే ప్రజలకు నేరుగా 300 నుంచి 400 రూపాయల వరకు ఆదా అవుతుంది. టెలికాం కంపెనీలకు పన్ను మినహాయింపు దొరికిన వెంటనే ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. ఇది ప్రజల జేబులకు భారం తగ్గించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories