ఈ టాబ్లెట్ రెండు వేరియంట్లలో వస్తోంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వైఫై మోడల్ ధర రూ. 12,999గా నిర్ణయించారు. కాగా 8 జీబీ ర్యామ్, 128 జీబీ వైఫై + 4జీ ఎల్టీఈ వేరియంట్ ధర రూ. 14,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్లో భాగంగా రూ. 2,000 కార్డ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఆగస్టు 1 నుంచి వన్ప్లస్.ఇన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వంటి స్టోర్లలో అందుబాటులోకి రానుంది.