Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు షాక్.. మీ చాటింగ్ సీక్రెట్స్ ఓపెన్ ! అసలు ఏం జరుగుతోంది?

Published : May 08, 2026, 09:27 PM IST

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ తన యూజర్లకు షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై మీ సీక్రెట్ చాట్స్ సేఫ్ కాదు. మే 8 నుంచి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మెటా తొలగించింది. మీ ఇన్‌స్టా మెసేజ్‌లు వేరే వాళ్లు కూడా చూస్తారు.

PREV
15
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై ప్రైవేట్ మాటలు బంద్.. అసలు కారణం ఇదే!

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫ్రెండ్స్‌తో లేదా స్పెషల్ పర్సన్స్‌తో సీక్రెట్‌గా చాట్ చేస్తున్నారా? పర్సనల్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారా? అయితే ఈ రోజే ఆ పని ఆపేయండి! ఎందుకంటే, ఇప్పటివరకు మీ చాటింగ్‌కు శ్రీరామరక్షలా ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీని మెటా సంస్థ అధికారికంగా తీసేసింది.

మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం నుంచి మీ డిజిటల్ ప్రైవసీకి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీని ఉండదు. గతంలో మీ మెసేజ్‌లు కేవలం మీకు, మీరు పంపిన వ్యక్తికి మాత్రమే కనిపించేవి. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండదు. ఇతరులు కూడా చూసే అవకాశముంది.

25
భద్రతా కవచం మాయం: ఏంటి ఈ మార్పు?

మెటా సంస్థ అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ లలో ఉండే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను నిలిపివేసింది. 2023లో ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్, యూజర్ల మెసేజ్‌లను కంపెనీ కూడా చూడలేనంత పటిష్ఠంగా ఉంచేది. కానీ తాజా పాలసీ మార్పుల వల్ల ఆ సెక్యూరిటీ ఫీచర్ పోయింది. దీని అర్థం ఏంటంటే, మీ ప్రైవేట్ చాట్స్ ఇకపై మునుపటిలా 100% ప్రైవేట్ కాదు.

35
మెటా ముందే హెచ్చరించింది

ఈ సంచలన నిర్ణయం గురించి మెటా ఒక్కసారిగా బాంబు పేల్చలేదు. ఈ ఏడాది మార్చిలోనే దీనిపై యూజర్లను హెచ్చరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ మీడియా లేదా ముఖ్యమైన మెసేజ్‌లు ఉన్నవారు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని, బ్యాకప్ తీసుకోవాలని సూచించింది. 

ఎన్‌క్రిప్షన్ తొలగించిన తర్వాత ఆ మెసేజ్‌లను యాక్సెస్ చేయడం సులభతరం అవుతుంది, ఇది ప్రైవసీ పరంగా ఆందోళన కలిగించే విషయమే. అయితే, ప్రస్తుతానికి ఈ మార్పు కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కు మాత్రమే పరిమితం చేశారు. వాట్సాప్ లేదా మెసెంజర్ వంటి ఇతర మెటా యాప్స్‌లో ఈ మార్పు ఇంకా రాలేదు.

45
ఈ కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి?

మెటా ఇంతటి రిస్క్ ఉన్న నిర్ణయం ఎందుకు తీసుకుందనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీనికి ప్రధాన కారణం చైల్డ్ సేఫ్టీ అని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

1. భారీ జరిమానా: 2026 మార్చిలో న్యూ మెక్సికో జ్యూరీ మెటాపై 375 మిలియన్ డాలర్ల భారీ జరిమానా విధించింది. యూజర్ల భద్రత విషయంలో కంపెనీ తప్పుదోవ పట్టించిందని, దీనివల్ల ప్లాట్‌ఫామ్‌పై చిన్నారులపై వేధింపులు పెరిగాయని ఆరోపణలు వచ్చాయి.

2. నేరాల నియంత్రణ: ఎన్‌క్రిప్షన్ తొలగించడం వల్ల మెటా అవసరమైనప్పుడు మెసేజ్‌లను స్కాన్ చేయగలుగుతుంది. దీనివల్ల చైల్డ్ అబ్యూస్ మెటీరియల్, ఆన్‌లైన్ గ్రూమింగ్ వంటి నేరాలను అరికట్టవచ్చని కంపెనీ భావిస్తోంది.

55
అంతర్జాతీయ ఒత్తిడి కూడా ఒక కారణమేనా?

కేవలం జరిమానాలు మాత్రమే కాదు, అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాల ప్రభుత్వాలు కూడా టెక్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. బ్రిటన్ ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ 2023, ఈయూ 'చాట్ కంట్రోల్ రెగ్యులేషన్' వంటి చట్టాలు హానికరమైన కంటెంట్‌ను గుర్తించాలని కంపెనీలను ఆదేశిస్తున్నాయి. నేరాలను అరికట్టే దిశగా మెటా ఈ అడుగు వేసినప్పటికీ, సామాన్య యూజర్లు మాత్రం తమ ప్రైవసీ గురించి తెగ టెన్షన్ పడిపోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories