BSNL 5G: బీఎస్ఎన్ఎల్ 5జీ ట్రయల్స్.. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ఇక గుండెదడే!
ఈమధ్యకాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను గణనీయంగా ఆకట్టుకుంటోంది. గడిచిన ఏడు నెలల్లో కొత్తగా 55 లక్షలమంది వినియోగదారులు జతయ్యారని కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించారు. ఈ జోరును ఇంకా కొనసాగించడానికి 5G సర్వీసులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన 5G ట్రయల్స్ కూడా ప్రారంభించినట్టు సమాచారం.