బ్రిటన్లోని పాఠశాల విద్యార్థులపై జరిగిన ఒక సర్వేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రతి 10 మంది విద్యార్థులలో ఆరుగురు (60%) విద్యార్థులు, ఏఐ టూల్స్ తమ పనితనాన్ని ప్రభావితం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల పనులు వేగంగా పూర్తవుతున్న మాట నిజమే అయినప్పటికీ, వారి సొంత నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతున్నాయని వారు అంగీకరించారు. పని సులభతరం కావడం కంటే, వ్యక్తిగత ఎదుగుదల దెబ్బతినడం ఇక్కడ ప్రధాన సమస్యగా మారుతోంది.
ఏఐ వాడకంలో సమతుల్యత అవసరం
టెక్నాలజీ అనేది మనకు సహాయకారిగా ఉండాలి తప్ప, మన మెదడుకు ప్రత్యామ్నాయం కాకూడదు. చాట్ జీపీటీ వంటి టూల్స్ను కేవలం ఒక గైడ్గా మాత్రమే ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ప్రతిదానికీ ఏఐని ఆశ్రయించకుండా సొంతంగా ఆలోచించే అలవాటు చేసుకోవాలి. అప్పుడే జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, మేథోశక్తి పదిలంగా ఉంటాయి. లేదంటే టెక్నాలజీపై అతిగా ఆధారపడటం వల్ల మనం మానసిక శ్రమను పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ అధ్యయాల ఆధారంగా రూపొందించాము.