Virat Kohli : రబాడ ఓవర్‌లో 5 ఫోర్లు.. అంపైర్‌తో ఫైట్.. కోహ్లీ విశ్వరూపం మాములుగా లేదుగా!

Published : Apr 30, 2026, 10:30 PM IST

Virat Kohli: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ వికెట్ వివాదాస్పదమైంది. అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

PREV
15
అంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ ఫైర్.. గ్రౌండ్ లో హైడ్రామా

ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన 42వ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆట కంటే కూడా విరాట్ కోహ్లీ ఫైర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అవుట్ అయిన తీరుపై కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. డగౌట్ వద్ద కోహ్లీ అసహనంతో ఊగిపోయిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

25
వివాదానికి కారణం ఏంటి?

ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రజత్ పాటిదార్ ఒక షాట్ ఆడేందుకు ప్రయత్నించి బ్యాలెన్స్ కోల్పోయారు. బంతి గాలిలోకి లేవగా, గుజరాత్ ఫీల్డర్ జేసన్ హోల్డర్ అద్భుతంగా పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ దీనిని అవుట్‌గా ప్రకటించారు. అయితే, రీప్లేలో బంతి నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. కానీ, అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా పాటిదార్‌ను అవుట్‌ ఇచ్చారు. ఇది చూసిన విరాట్ కోహ్లీ సహనం కోల్పోయారు. డగౌట్ నుంచి బయటకు వచ్చి ఫోర్త్ అంపైర్‌తో తీవ్రంగా వాదించారు. ఈ నిర్ణయం వల్ల ఆర్సీబీ కీలక వికెట్‌ను కోల్పోయింది.

35
రబాడ ఓవర్‌లో కోహ్లీ ఊచకోత

వికెట్ వివాదం పక్కన పెడితే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో మాత్రం విశ్వరూపం చూపించారు. కగిసో రబాడ వేసిన ఒకే ఓవర్‌లో కోహ్లీ వరుసగా 5 ఫోర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించారు. ఒకప్పుడు క్రిస్ గేల్ సృష్టించిన రికార్డును కోహ్లీ కళ్లముందుంచారు. పవర్ ప్లే సమయంలో రబాడ బంతులను కవర్స్, పాయింట్ మీదుగా బౌండరీలకు తరలిస్తూ కోహ్లీ తన దూకుడు చూపించాడు. కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేసి తన టీ20 కెరీర్‌లో అత్యంత వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

45
ఎలైట్ క్లబ్‌లోకి కోహ్లీ

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఐదు ఫోర్లు కొట్టిన మూడో ఆర్సీబీ బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించారు. గతంలో 2013లో పుణే వారియర్స్ మీద క్రిస్ గేల్, 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ మీద షేన్ వాట్సన్ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వీరి సరసన కోహ్లీ చేరారు. అయితే, దూకుడుగా ఆడుతున్న కోహ్లీని రబాడ తన తర్వాతి ఓవర్‌లో బోల్తా కొట్టించాడు. రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ 28 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

55
పేకమేడలా కూలిన ఆర్సీబీ బ్యాటింగ్

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బ్యాటర్లు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. కోహ్లీ 28 పరుగులకే అవుట్ కాగా, దేవదత్ పడిక్కల్ ఒక్కడే 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా వంటి హిట్టర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చివర్లో భువనేశ్వర్ (15), షెపర్డ్ (17), వెంకటేష్ అయ్యర్ (12) చేసిన మెరుపులతో ఆర్సీబీ ఎలాగోలా 155 పరుగులు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories