Team India : శ్రీ చరణి చెత్త రికార్డు.. భువీ రికార్డు సమం చేస్తూ ఘోర పరాభవం !

Published : Mar 01, 2026, 08:34 PM IST

Team India : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత స్పిన్నర్ శ్రీ చరణి 106 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచింది, భారత్ 185 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

PREV
16
శ్రీ చరణికి షాక్.. ఆసీస్ చేతిలో భారత్ చిత్తు

హోబర్ట్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్‌గా ఆమె నిలిచారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా పురుషుల జట్టు పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న పాత రికార్డును ఆమె సమం చేశారు. కేవలం రికార్డు పరంగానే కాకుండా, మైదానంలో కూడా భారత బౌలర్లు ఆసీస్ బ్యాటర్ల ధాటికి విలవిలలాడారు.

26
భువనేశ్వర్ కుమార్ చెత్త రికార్డు సమం

ఈ మ్యాచ్‌లో శ్రీ చరణి తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 106 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. గతంలో 2015లో ముంబై లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లలో 106 పరుగులు ఇచ్చారు. ఇప్పుడు శ్రీ చరణి కూడా అదే స్థాయిలో పరుగులు ఇచ్చి, భారత్ తరపున వన్డేల్లో అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచారు. అంతేకాకుండా, ఒక వన్డే ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన మొదటి భారత స్పిన్నర్‌గా కూడా ఆమె ఒక చేదు జ్ఞాపకాన్ని మూటగట్టుకున్నారు.

36
చాహల్ రికార్డు బద్దలు

ఇప్పటివరకు భారత స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డును కలిగి ఉండేవారు. 2020లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై చాహల్ 89 పరుగులు ఇచ్చారు. తాజా ప్రదర్శనతో శ్రీ చరణి ఆ రికార్డును అధిగమించారు. హోబర్ట్ మ్యాచ్‌లో 11వ ఓవర్ నుంచి బౌలింగ్ ప్రారంభించిన ఆమె, ఆది నుంచే లైన్ అండ్ లెంగ్త్ నియంత్రించడంలో ఇబ్బంది పడ్డారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆమె బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ స్కోరు సాధించారు.

46
అలీసా హీలీ మెరుపు దాడి

ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ తన చివరి వన్డే ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడారు. 32వ ఓవర్లో శ్రీ చరణి బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ఆ ఒక్క ఓవర్లోనే నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మొత్తం 23 పరుగులు రాబట్టారు. హీలీ 98 బంతుల్లోనే 158 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. శ్రీ చరణి తన చివరి ఓవర్లో కూడా నికోలా కేరీ ధాటికి 22 పరుగులు సమర్పించుకున్నారు. అయితే, ఇన్ని పరుగుల మధ్య కూడా తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్హామ్ వంటి కీలక వికెట్లను ఆమె పడగొట్టడం కొంత ఊరటనిచ్చే అంశం.

56
దీప్తి శర్మ కూడా ఖరీదైన బౌలర్‌గానే..

శ్రీ చరణితో పాటు మరో సీనియర్ ప్లేయర్ దీప్తి శర్మ కూడా ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చారు. ఆమె తన 10 ఓవర్లలో 90 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీశారు. దీంతో ప్రియా మిశ్రా (88 పరుగులు) పేరిట ఉన్న పాత రికార్డును వీరిద్దరూ దాటేశారు. భారత బౌలర్ల వైఫల్యంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది ఆస్ట్రేలియా మహిళా జట్టు చరిత్రలో మూడవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

66
భారత్ ఘోర ఓటమి

410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో 185 పరుగుల భారీ తేడాతో భారత్ ఓటమి పాలైంది. 2025 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు, ఈ ఓటమి ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ఆస్ట్రేలియాపై గత కొన్ని ఏళ్లుగా భారత బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories