సంజూ టీం నుంచి అవుట్..
ప్రస్తుతం, జితేష్ శర్మ వికెట్ కీపర్గా బాధ్యతలు చేపడుతుండటంతో సంజు ఏకంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇక సంజు మరల తిరిగి జట్టులోకి రావడం కష్టమేనా? ఆసియా కప్ 2025కు ముందు జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్లో అవకాశం లభిస్తుందని, శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారని తొలుత భావించారు. అయితే, జట్టు యాజమాన్యం సంజు శాంసన్ ని ఎంచుకుని ఐదవ స్థానంలో బ్యాటింగ్కు పంపింది. ఈ నిర్ణయం కొంతవరకు విజయవంతమైంది. టోర్నీలో సంజు తనదైన రీతిలో రాణించాడు. ఫైనల్ లో తిలక్ వర్మతో కలిసి సంజు నెలకొల్పిన భాగస్వామ్యం టీం ఇండియాను తిరిగి మ్యాచ్ లోకి తీసుకువచ్చింది.