రోహిత్ అద్భుత ఫామ్.. అభిమానులకు పండగే
అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉండే రోహిత్, ఇలా దేశవాళీ క్రికెట్కు వచ్చి ఆడటం టోర్నీకి ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది. ముంబై జట్టు టోర్నీలో ముందంజ వేయడానికి రోహిత్ ఫామ్ ఎంతో కీలకం కానుంది.
మరోవైపు, రోహిత్ 50 ఓవర్ల ఫార్మాట్లో ఎంత భయంకరమైన ఫామ్లో ఉన్నాడో సెలెక్టర్లకు, అభిమానులకు ఈ ఇన్నింగ్స్ ద్వారా స్పష్టమైంది. సిక్కిం జట్టుపై సాధించిన ఈ విజయం ముంబై జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
ముంబై తుది జట్టు (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేశ్ లాడ్, ముషీర్ ఖాన్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), షామ్స్ ముల్రాని, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), తుషార్ దేశ్పాండే, సిల్వెస్టర్ డిసౌజా.
సిక్కిం తుది జట్టు (ప్లేయింగ్ XI): లీ యోంగ్ లెప్చా (కెప్టెన్), ఆశిష్ థాపా (వికెట్ కీపర్), అమిత్ రాజేరా, రాబిన్ లింబూ, గురిందర్ సింగ్, క్రాంతి కుమార్, పాల్జోర్ తమాంగ్, అంకుర్ మాలిక్, కే సాయి సాత్విక్, ఎండీ సప్తుల్లా, అభిషేక్ కుమార్ షా.