“ఏడు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించడం ద్వారా మీరు ప్రతి భారతీయుడిలో విశ్వాసాన్ని పెంచారు. ఈ విజయం క్రీడలో మీ అద్భుతమైన నైపుణ్యం, కష్టపడి సాధించిన ఫలితం" అని రాష్ట్రపతి మహిళా జట్టు పై ప్రశంసలు కురిపించారు.
జట్టు ప్రధాన కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. "క్రికెట్ లాంటి జట్టు ఆటలో ప్రతి ఒక్కరూ సమయానుకూలంగా కట్టుబడి ఉండాలి. మీరు అందరూ అదే చేశారు" అని అన్నారు.
అలాగే, న్యూజిలాండ్పై విజయానంతరం దేశం మొత్తం నమ్మకం కలిగిందని అన్నారు. మన కుమార్తెలు ఎప్పటికీ వెనక్కి తగ్గరని నిరూపిస్తూ విజయం సాధించాని కొనియాడారు. ఆటగాళ్ల కృషి, క్రమశిక్షణ, కుటుంబాల ఆశీర్వాదాలు ఈ విజయానికి మూలమని ఆమె అభినందించారు.
“మీరు భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ పుట రాశారు. భవిష్యత్తులో కూడా భారత క్రికెట్ను అగ్రస్థానంలో నిలుపుతారని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు.