భారత ఇన్నింగ్స్కు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ వెన్నెముకగా నిలిచాడు. జైస్వాల్ 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తన తొలి వన్డే సెంచరీని పూర్తి చేసుకున్న అతను, ఛేజింగ్ను అత్యంత ఓర్పుతో, నైపుణ్యంతో పూర్తి చేశాడు. ఈ సెంచరీతో టెస్ట్, వన్డే, టీ20ఐ... మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ఆరవ భారత బ్యాట్స్మెన్గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు.
రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో మంచి నాక్ ఆడాడు. 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులు సాధించాడు. జైస్వాల్తో కలిసి రోహిత్ తొలి వికెట్కు 155 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రోహిత్ శర్మను సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అవుట్ చేశాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. కోహ్లీ కేవలం 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 65 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. ఈ సిరీస్లో కోహ్లీకి ఇది వరుసగా మూడవ వన్డే అర్ధ సెంచరీ కావడం విశేషం.