ఆ ముగ్గురి తర్వాత రోహిత్ శర్మనే.. 18 ఏళ్ల కెరీర్లో మరో అద్భుతం!
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో, దక్షిణాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కేశవ్ మహారాజ్ వేసిన నాలుగో బంతిని లాంగ్-ఆన్ దిశగా ఆడి సింగిల్ తీయడం ద్వారా రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగుల మార్కును దాటాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ముందు రోహిత్ 27 పరుగులు చేయాల్సి ఉండగా, ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడి ఈ ఘనత సాధించారు.
దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో భారతీయ బ్యాటర్గా, ప్రపంచవ్యాప్తంగా 14వ ఆటగాడిగా రోహిత్ నిలిచారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (34,357), విరాట్ కోహ్లీ (27,910), రాహుల్ ద్రవిడ్ (24,064) ముందు వరుసలో ఉన్నారు. సౌరవ్ గంగూలీ (18,433), ఎంఎస్ ధోని (17,092) వంటి దిగ్గజాలు టాప్-5లో చోటు దక్కించుకున్నారు.