వేలంలో అత్యధిక బేస్ ధర అయిన ₹2 కోట్ల జాబితాలో మొత్తం 45 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ 45 మందిలో కేవలం ఇద్దరు భారతీయ ఆటగాళ్లు మాత్రమే ఉండటం గమనార్హం. వారే రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్. మిగిలిన 43 మంది విదేశీ ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
₹2 కోట్ల బేస్ ధరతో ఉన్న ప్రముఖ విదేశీ ఆటగాళ్లలో కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జేమీ స్మిత్, ముజీబ్ ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్ (ఆఫ్ఘనిస్తాన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కూపర్ కోనోలీ, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా), ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్), గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, టామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, డేనియల్ లారెన్స్, లియామ్ లివింగ్స్టోన్ (ఇంగ్లాండ్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్వెల్ (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ, లుంగీ ఎన్గిడి, ఎన్రిక్ నోర్ట్జే (దక్షిణాఫ్రికా), పతిరాణా, మహేశ్ తీక్షణ, హసరంగా (శ్రీలంక) వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లకు వేలంలో భారీ ధర లభించే అవకాశం ఉంది.