ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి 17 మంది ఆటగాళ్లను రీటైన్ చేస్తూ, అనుభవం, యువ శక్తి కలయికగా జట్టును తీర్చిదిద్దింది. అక్షర్ పటేల్ను కెప్టెన్గా కొనసాగించనుంది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ట్రిస్టిన్ స్టబ్స్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో కొనసాగనున్నారు.
రీటైన్ చేసిన పూర్తి జాబితాలో అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పొరెల్, సమీర్ రిజ్వీ, అజయ్ మండల్, విప్రాజ్ నిగమ్, మాధవ్ తివారి వంటి యువ క్రికెటర్లు కూడా ఉన్నారు.
జట్టు స్పిన్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు కుల్దీప్ యాదవ్ను కొనసాగించగా, పేస్ విభాగంలో మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా వంటి బౌలర్లను రీటైన్ చేశారు.