ఈ సిరీస్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో అదరగొట్టి, ఫామ్లో ఉండి జట్టులోకి తిరిగి వస్తున్నారు. అయితే, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అందుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది.
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడిన అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ, కొన్ని రిపోర్టుల ప్రకారం అతను తుది జట్టులో చేరడం పై సందేహాలు ఉన్నాయి.
భారత జట్టు : శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, మిచ్ హే (వికెట్ కీపర్), కైల్ జేమీసన్, జోష్ క్లార్క్సన్, జాక్ ఫౌల్క్స్, ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, నిక్ కెల్లీ, మైఖేల్ రే, జేడెన్ లెనాక్స్.