IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !

Published : Feb 09, 2026, 07:57 PM IST

India vs Namibia : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. అభిషేక్ శర్మ అస్వస్థత, వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీ వంటి కీలక మార్పులతో భారత్ బరిలోకి దిగనుంది.

PREV
15
నమీబియాతో పోరుకు భారత్ రెడీ.. ప్లేయింగ్ 11లో వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ?

టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. అమెరికాపై ఘనవిజయంతో టోర్నీని ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, ఇప్పుడు తన తదుపరి పోరుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.

25
సూర్యకుమార్ అద్భుత ఇన్నింగ్స్.. అమెరికాపై విజయం

అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా పోరాడి జట్టును ఆదుకున్నాడు. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఒక దశలో 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను సూర్య తన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 161/9 పరుగులు చేయగా, అమెరికా 132 పరుగులకే పరిమితమైంది.

35
అభిషేక్ శర్మకు విశ్రాంతి.. సంజూ శామ్సన్‌కు ఛాన్స్?

తొలి మ్యాచ్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అయితే, అతను ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ, చిన్న జట్టు అయిన నమీబియాతో జరిగే మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి వారు అమెరికాపై తక్కువ పరుగులకే పరిమితమైన నేపథ్యంలో శాంసన్ రాక జట్టుకు బలాన్నిస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.

45
వాషింగ్టన్ సుందర్ గ్రాండ్ కంబ్యాక్

గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ జట్టులోకి రానున్నాడు. అతను పూర్తిగా ఫిట్‌నెట్ సాధించాడని, ఢిల్లీలో నేరుగా జట్టుతో కలుస్తాడని కెప్టెన్ స్పష్టం చేశాడు. సుందర్ రాకతో ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై వేటు పడే అవకాశం ఉంది. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే అంచనాల నేపథ్యంలో, ఆఫ్ స్పిన్నర్ అయిన సుందర్ జట్టుకు కీలకం కానున్నాడు.

55
బుమ్రా వచ్చేస్తున్నాడు.. మహమ్మద్ సిరాజ్ అవుట్?

జ్వరం కారణంగా అమెరికా మ్యాచ్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. నమీబియాతో జరిగే పోరులో అతను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, బుమ్రా జట్టులోకి వస్తే ఎవరిని తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాపై 3 వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన మహమ్మద్ సిరాజ్ లేదా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం సిరాజ్‌నే తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నమీబియాతో తలపడే భారత అంచనా తుది జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

Read more Photos on
click me!

Recommended Stories