కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిలకడగా ఆడలేకపోతుండటం టీమ్ మేనేజ్మెంట్ను టెన్షన్ పెట్టిస్తోంది. తిలక్ వర్మపై కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాకు నాలుగో టీ20లో షాక్ తప్పదనే కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. అందుకే నాలుగో మ్యాచ్లో గెలిస్తే సిరీస్కు సంబంధించి ఎలాంటి టెన్షన్ ఉండదని చర్చ జరుగుతోంది.