భారత్ జట్టులో ప్రధాన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి బ్యాకప్గా ఉన్నా, అతని అందుబాటుపై సందేహాలున్నాయి. యువ ఆటగాళ్లైన అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ల ప్రదర్శనపై ప్రధాన దృష్టి ఉంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తారు.
భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.