ఈ సిరీస్లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. వైస్ కెప్టెన్గా శుభ్ మన్ గిల్ ఉంటారు. జట్టులో చాలా మంది యంగ్ ప్లేయర్లకు చోటు దక్కింది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్ దాడికి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. బుమ్రా, అర్షదీప్, హర్షిత్ రాణా పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.