టీమిండియా టీ20 ప్రపంచకప్ చరిత్ర చూసుకుంటే.. 2007లో తొలి ఐసీసీ టోర్నీతో మొదలైంది. అక్కడ టీమిండియా, పాకిస్తాన్ జట్టును ఓడించి ఫైనల్ లో విజయం సాధించింది. ఇక చివరిగా 2024లో టీమిండియా రెండోసారి చాంపియన్గా నిలిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2007లో ప్రారంభమైన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మొదటి ఆడిషన్ లోనే టీమిండియా విజేతగా నిలిచింది. తొలి టీ20 ప్రపంచకప్ 2007లో టీమిండియా దక్కించుకోగా.. ఇక చివరిగా 2024లో మరో టీ20 ప్రపంచకప్ గెలిచింది. 9 ఎడిషన్లలో టీమిండియా మంచి ప్రదర్శనలు కనబరిచింది.
25
2007లో తొలి టైటిల్..
2007లో ఎంఎస్ ధోని నేతృత్వంలో టీమిండియా తొలి టీ20 టైటిల్ గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఓడించి ట్రోఫీను సాధించింది. 2009లో Super 8sలో టోర్నీ నుంచి వైదొలిగింది. 2010లోనూ అంతే.! 2012లో లీగ్ స్టేజి నుంచి వైదొలిగింది. ఈ తొమ్మిది సీజన్లలో టీమిండియా ఎత్తుపల్లాలను చూసింది. అయితే 2007లో భారత్ ట్రోఫీ దక్కించుకోవడం అదొక స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు.
35
ఆ తర్వాత టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన..
2014లో టీమిండియా ఫైనల్ వరకు చేరి రన్నరప్ గా టోర్నీ నుంచి వైదొలిగింది. 2016లో సెమీఫైనల్ వరకు వెళ్ళింది. 2021లో యూఏఈలోని వరల్డ్ కప్లో టీమిండియా కప్పు కొట్టలేకపోయింది. 2022లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకుముందు 2014లో కూడా శ్రీలంక చేతలో ఫైనల్ ఓడిపోయింది.
2024లో టీమిండియా తిరిగి టీ20 ప్రపంచకప్ గెలిచింది. సౌతాఫ్రికాను ఫైనల్లో 7 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఇది టీమిండియాకు రెండో టీ20 వరల్డ్ కప్. అన్నీ మ్యాచ్లలో ఓటమి లేకుండా విజయం సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ విజయంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల నుంచి రిటైర్ అయ్యారు.
55
గణాంకాలు ఇలా ఉన్నాయి..
టీమిండియా ఇప్పటివరకు 2 టోర్నమెంట్ టైటిల్స్ సాధించింది. 2007, 2024లో రెండుసార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్స్ సాధించింది. 2014లో రన్నరప్గా నిలిచింది. మొత్తంగా 53 మ్యాచ్లు ఆడగా.. అందులో 35 విజయాలు, 15 ఓటములు పొందింది. విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ ఈ విజయాల్లో కీలక పాత్రలు పోషించారు.