వెస్టిండీస్‌పై చారిత్రాత్మక సిరీస్ విజయం.. భారత్ ప్రపంచ రికార్డు

Published : Oct 14, 2025, 05:00 PM IST

India Creates History : వెస్టిండీస్‌పై 2-0తో టెస్టు సిరీస్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఒకే జట్టుపై అత్యధిక సిరీస్ విజయాల ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

PREV
16
వెస్టిండీస్ పై సూపర్ విక్టరీ కొట్టిన భారత్

వెస్టిండీస్‌ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0తో ఘన విజయం సాధించింది. ఢిల్లీ లోని అరుణ్ జేట్లీ స్టేడియంలో జరిగిన రెండవ టెస్టు చివరి రోజు భారత్‌ విజయానికి 58 పరుగులు మాత్రమే అవసరం. మొదటి సెషన్‌లోనే భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఆయన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీశారు.

ఈ సిరీస్ విజయం ద్వారా టీమ్ ఇండియా ఒక చారిత్రాత్మక ఘనత సాధించింది. ఒకే జట్టుపై అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన ప్రపంచ రికార్డును భారత్ నెలకొల్పింది. ఇంతకు ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికాపై భారత్ పేరున ఉండగా, ఇప్పుడు వెస్టిండీస్‌పై వరుసగా 10వ సారి సిరీస్ గెలిచి కొత్త మైలురాయిని చేరింది.

26
శుభ్‌మన్ గిల్‌కు ‘శుభ’ ఆరంభం

ఈ సిరీస్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా మొదటి టెస్టు సిరీస్. ఆయన నాయకత్వంలో భారత జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌పై సొంత గడ్డపై భారత్ 2-0తో గెలవడం గిల్ కెప్టెన్సీకి బెస్ట్ ఆరంభమని చెప్పాలి. రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. చివరి రోజు కేఎల్ రాహుల్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆయనతో పాటు సాయి సుదర్శన్ 39 పరుగులు చేశాడు.

36
బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 175 పరుగులతో అద్భుతంగా ఆడాడు. కెప్టెన్ గిల్ 129 పరుగులు సాధించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ ఫాలో ఆన్ అమలు చేయగా, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసింది. భారత్‌ ముందు121 పరుగుల లక్ష్యం ఉంచింది. స్వల్ప లక్ష్యాన్ని జట్టు సులభంగా చేధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

46
23 ఏళ్ల ఆధిపత్యం కొనసాగించిన భారత్

టెస్ట్ క్రికెట్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. వెస్టిండీస్ చివరిసారిగా భారత్‌పై టెస్ట్ గెలిచింది 2002లో. అప్పటి నుండి ఇప్పటి వరకు విండీస్ జట్టు భారత్‌ను ఒక సారి కూడా ఓడించలేకపోయింది. ఈ 23 ఏళ్ల ఆధిపత్యాన్ని రెండో టెస్టు విజయం మరోసారి భారత్ నిరూపించింది.

56
టీమిండియా ప్రపంచ రికార్డ్

భారత్, వెస్టిండీస్ మధ్య 2002 నుంచి 2025 వరకు జరిగిన సిరీస్‌లలో భారత్ 10 సార్లు విజయాన్ని సాధించింది. ఈ విజయంతో భారత్ అంతర్జాతీయ మ్యాచ్‌లలో తన 922వ విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్‌ను అధిగమించి భారత్ రెండవ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 1158 విజయాలతో మొదటి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 922 విజయాలతో మూడవ స్థానంలోకి జారుకుంది.

ఇక దేశీయ మైదానాల్లో అత్యధిక విజయాల జాబితాలో కూడా భారత్ మూడవ స్థానానికి చేరింది. ఆస్ట్రేలియా 262 విజయాలతో మొదటి స్థానంలో, ఇంగ్లాండ్ 241 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, భారత్ 122 విజయాలతో మూడో స్థానంలో నిలిచింది.

66
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్

వెస్టిండీస్‌పై ఈ సిరీస్ విజయంతో భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ సిరీస్ తరువాత భారత్ ఖాతాలో మరో 12 పాయింట్లు చేరాయి. స్థానంలో మార్పు లేకపోయినా, జట్టు స్థాయి మరింత బలపడింది.

వెస్టిండీస్‌పై భారత్ సాధించిన ఈ విజయంతో క్రికెట్ ప్రపంచంలో మరో చరిత్ర సృష్టించబడింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి ఇది విజయవంతమైన ప్రారంభం కాగా, భారత్ సరికొత్త రికార్డులతో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories