ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 448/5 వద్ద నిలిచింది. కేఎల్ రాహుల్, జురేల్, జడేజా సెంచరీలతో 400 మార్కును దాటేసింది. ప్రస్తుతం జడేజా 104*, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కాగా, భారత బౌలర్లు రాణించడంతో విండీస్ మొదటి ఇన్నింగ్స్లో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్కు 286 పరుగుల భారీ ఆధిక్యం వచ్చింది. రెండో రోజు భారత్ 327 పరుగులు సాధించి మూడు వికెట్లు కోల్పోయింది. గిల్ (50), రాహుల్ (100), జురేల్ (125), జడేజా (104) అద్భుత ఇన్నింగ్స్లు ఆడారు.
మొత్తం మీద భారత్ మొదట బౌలర్లు షాక్ ఇవ్వంగా.. ఆ తర్వాత బ్యాట్స్మెన్ అహ్మదాబాద్ టెస్ట్లో విండీస్ బౌలర్లను చితక్కొట్టారు. జడేజా, జురేల్, రాహుల్ సెంచరీలతో భారత్ మొదటి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దిశగా ముందుకు సాగుతోంది.