Indian shooter Swapnil Kusale : పారిస్ ఒలింపిక్స్ 2014లో పురుషుల రైఫిల్ 50 మీటర్ల 3-పొజిషన్స్ ఈవెంట్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే మెడల్ సాధించాడు. భారత్ కు మూడో మెడల్ అందించిన ఈ షూటర్.. ఈ విభాగంలో ఫైనల్ కు చేరుకుని చరిత్ర సృష్టించారు. అలాగే, మెడల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. అయితే, ఒలింపిక్ మెడల్ గెలిచిన స్వాప్నిల్ కుసాల్ కు, భారత ఛాంపియన్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. స్వప్నిల్ కూడా క్రీడల విషయంలో ధోనిని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఒలింపిక్స్ లో మెడల్ సాధించాడు.