• సౌతాఫ్రికా: తమ తదుపరి మ్యాచ్లో జింబాబ్వేను ఓడిస్తే నేరుగా సెమీస్కు చేరుతుంది. ఒకవేళ ఓడినా రన్ రేట్ బాగుంటే అవకాశం ఉంటుంది.
• వెస్టిండీస్: భారత్ను ఓడించి, ఇతర ఫలితాలు అనుకూలిస్తేనే విండీస్ సెమీస్ చేరుతుంది. వారి రన్ రేట్ ప్రస్తుతం +1.7900గా ఉంది.
• జింబాబ్వే: జింబాబ్వే సెమీస్ రేసులో ఉండాలంటే భారత్, సౌతాఫ్రికా రెండింటిపై గెలవాలి. భారత్ చేతిలో ఓడితే ఆ జట్టు టోర్నీ నుంచి అవుట్ అవుతుంది.
రాబోయే కీలక మ్యాచ్లు
ఫిబ్రవరి 26న రాత్రి 7 గంటలకు చెన్నైలో భారత్, జింబాబ్వే మధ్య కీలక పోరు ప్రారంభం అయింది. ఆ తర్వాత మార్చి 1న కోల్కతాలో భారత్ తన చివరి సూపర్-8 మ్యాచ్ను వెస్టిండీస్తో ఆడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ రన్ రేట్ -3.800గా ఉన్నందున, రాబోయే మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించడం సూర్యకుమార్ యాదవ్ సేనకు అత్యవసరం.