Test Team: కళ్లు తెరిచిన బీసీసీఐ.. టీమిండియా టెస్టుల కోసం మాస్టర్ ప్లాన్.!

Published : Apr 07, 2026, 07:09 PM IST

Test Team: గత రెండేళ్లుగా భారత టెస్ట్ జట్టు ఎదుర్కొంటున్న వరుస వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ ఒక భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాల తర్వాత వచ్చే శూన్యాన్ని భర్తీ చేసేందుకు.. 

PREV
15
బీసీసీఐ 'రెడ్ బాల్ రీసెట్' వ్యూహం ఇదే!

భారత గడ్డపై దశాబ్ద కాలంగా కొనసాగిన టీమిండియా ఆధిపత్యానికి గత ఏడాది న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఎదురైన పరాజయాలు పెద్ద బ్రేక్ వేశాయి. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, టెస్ట్ క్రికెట్‌లో భారత్ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. దీనికి "రెడ్ బాల్ రీసెట్" అని పేరు పెట్టారు.

25
యువ ప్రతిభకు పెద్దపీట:

కేవలం ఐపీఎల్ మెరుపులకే పరిమితం కాకుండా, టెస్ట్ క్రికెట్‌లో అవసరమైన ఓపిక, టెక్నిక్ ఉన్న యువ ఆటగాళ్లను వెలికితీయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే లాంటి యువ కిశోరాలను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. వీరికి అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందించి, భవిష్యత్తులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల స్థానాలను భర్తీ చేసేలా సిద్ధం చేస్తారు.

35
ప్రత్యేక టోర్నమెంట్, ఎంపిక ప్రక్రియ:

ఈ వ్యూహంలో భాగంగా జూన్, జూలై నెలల్లో ఒక ప్రత్యేక టోర్నమెంట్‌ను బీసీసీఐ నిర్వహించనుంది. ఇందులో 25 ఏళ్ల లోపు వయసున్న 64 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.

45
నాలుగు జట్లుగా విభజించి..

రంజీ ట్రోఫీ, కూచ్ బెహర్ ట్రోఫీ, సీకే నాయుడు ట్రోఫీలలో రాణించిన వారితో పాటు సమీర్ రిజ్వీ వంటి ఐపీఎల్ యువతను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వీరిని నాలుగు జట్లుగా విభజించి, విభిన్నమైన పిచ్‌లపై వారి నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.

55
భవిష్యత్తు లక్ష్యం:

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ టోర్నీలో రాణించిన వారిని నేరుగా అండర్-19 ఎమర్జింగ్ జట్లకు ఎంపిక చేసి శ్రీలంక పర్యటనకు పంపనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా రాబోయే దశాబ్ద కాలం పాటు టెస్ట్ క్రికెట్‌లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించేలా పటిష్టమైన బెంచ్ బలాన్ని నిర్మించడమే బీసీసీఐ లక్ష్యం.

Read more Photos on
click me!

Recommended Stories