త్రిలింగ క్షేత్రాలు అని భక్తులు పిలుచుకునే మూడు పరమ పవిత్రమైన శైవ క్షేత్రాలు త్రిలింగ క్షేత్రాలు. అవే శ్రీశైల క్షేత్రం, కాళేశ్వర క్షేత్రం, ద్రాక్షారామ క్షేత్రం. ఈ మూడు క్షేత్రాలను కలిపి త్రిలింగ క్షేత్రాలు అంటారు. త్రిలింగమే క్రమేణా తెలుగు గా మారిందని, అలాగే ఈ క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ ప్రాంతమని కాలక్రమేణా అదే తెలంగాణగా మారినట్లు పెద్దలు చెబుతారు.