Spiritual :ఆదివారం రోజు ఈ పనులు చేయకండి.. కష్టాలు కోరి తెచ్చుకోకండి!

First Published Nov 3, 2023, 2:27 PM IST

 Spiritual: హిందువులకి ఆదివారం చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజుని సాంప్రదాయం ప్రకారం ఈ పనులు చేయకూడదు చేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే. ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం.
 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం కొన్ని పనులు చేయకూడదు. ఈ రోజున అటువంటి పనులు చేయడం వలన సూర్య భగవానుని ఆగ్రహానికి గురి అవుతాం. ఆదివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.
 

 జ్యోతిష్యం ఆధారంగా రంగులను ఎంచుకోవడంలో మీ రాశి చక్రం ప్రకారం గ్రహాలను ప్రభావితం చేస్తుంది. ఆదివారాల్లో మీరు నలుపు, నీలం లేదా బూడిద రంగు దుస్తులను ధరించకూడదు. ఆదివారాన్ని సూర్యభగవానుని రోజుగా పరిగణిస్తారు. కాబట్టి ఈరోజున గులాబీ, బంగారం, నారింజ మరియు ఎరుపు రంగులను ధరించడం వల్ల జీవితంలో గౌరవం మర్యాదలు లభిస్తాయి.
 

అలాగే ఆదివారం రోజు జుట్టు, గోళ్లు కత్తిరించకూడదని అంటారు. అలాగే ఆవాల నూనె జుట్టుకు మసాజ్ చేయడం కూడా అరిష్టానికి దారితీస్తుంది. ఆదివారం రోజు పొరపాటున కూడా మాంసము, చేపలు, మధ్యం తినకూడదు అని చెబుతారు, అలా చేయటం వలన సూర్య భగవానుడి ఆగ్రహానికి కారణం అవుతుంది. 
 

అలాగే ఆ రోజున ఎరుపు రంగులో ఉండే కాయగూరలు బచ్చలకూర, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు కూడా దూరంగా ఉంచాలి. రాగి కి వాస్తు దోషాలను పోగొట్టే శక్తి ఉంది ఇది మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుస్తుంది మరియు మీ కీర్తికి ప్రతిష్టలు తీసుకొస్తుంది అందుకని ఆదివారం రోజు రాగి వస్తువులను మార్పిడి చేయకూడదు.
 

రాగితో తయారు చేసిన వస్తువులను ఆదివారాల్లో కొనకూడదు, విక్రయించకూడదు. సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి ఆదివారం ఉపవాసం ఉండండి. సూర్యోదయం సమయంలో గాయత్రి మంత్రం పఠించే సూర్యునికి నీరు అర్పించండి.
 

 ఆదివారం నుండి ప్రతిరోజు 108 సార్లు సూర్య మంత్రాన్ని జపించండి, ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి. అలాగే ఉదయం పూట నీళ్లు తాగటానికి రాగి పాత్రను ఉపయోగించండి. ఈ విధంగా చేయడం వలన సూర్య భగవానుడు ప్రసన్నమవుతాడు.

click me!