దీపావళి పండగ ప్రాముఖ్యత...
దీపావళి, అంటే “దీపాల పండుగ”, చీకటిపై కాంతి విజయం, చెడుపై మంచి విజయం, అజ్ఞానంపై జ్ఞానం విజయం అనే సందేశాన్ని అందిస్తుంది. ఇది శ్రీరాముడు రావణుడిని సంహరించి, అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుని గుర్తు చేసే పండుగ. అప్పట్లో ప్రజలు దీపాలు వెలిగించి రాముడిని స్వాగతించారు. అలా ఈ రోజు నుంచి దీపావళి పండుగ ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. అంతేకాదు... నరకాసురుడిని సత్యభామ చంపిన రోజు సందర్భంగా కూడా ఈ పండగను జరుపుకుంటారు.
దీపావళి కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు. ఇది ఆనందం, సంపద, అదృష్టం, కుటుంబ ఐక్యతకు సంకేతం. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడుని పూజిస్తారు. లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశిస్తుందని, ఆమెతో పాటు శాంతి , శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు.