అలాగే తులా రాశి వారు తెలుపు లేదా నీలం రంగు వినాయకుడిని ఆరాధించాలి. అలాగే అరటి పండ్లు, తెల్ల రంగు పువ్వులు, లడ్డులు సమర్పించాలి. అలాగే వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు గణేశుడిని ప్రతిష్టించి, ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. వీరు ఖర్జూరాలు దానిమ్మపళ్ళని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ధనుస్సు రాశి వారు పసుపు రంగులో ఉండే విగ్రహాన్ని పూజించి, సెనగపిండి లడ్డూలు నైవేద్యం సమర్పించాలి.