కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి చాలా కాలం అవుతోంది. ముందుగా.. 40ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత.. 18ఏళ్లు నిండిన వారికి ఇఛ్చారు. ఇప్పుడు టీనేజర్లకు కూడా ఇస్తున్నారు. అయితే.. ఈ వ్యాక్సిన్ ని ఇప్పటి వరకు చాలా మంది తీసుకున్నారు. అయినప్పటికీ.. ఈ వ్యాక్సిన్ విషయంలో చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి.