ఆ తర్వాత పిల్లల్ని సంతోషపెట్టడానికి తెనాలి రామలింగం కథల పుస్తకాలును, నైతిక ఆలోచనలు పెంపొందించే పుస్తకాలు కొని మీ ఇంట్లో చక్కగా అమర్చండి. ఈ పుస్తకాలు మీ పిల్లల్లో పఠన నైపుణ్యాలు పెంపొందించడానికి బాగా సహాయపడతాయి. అయితే పిల్లలు ఒక్కరే చదవడం కష్టం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్తో కూర్చుని కథా పుస్తకాలను చదవాలి. కథలు చదివినప్పుడు, చెప్పినప్పుడు, అవి వారి మనస్సులో లోతుగా పాతుకుపోతాయి. దీంతో వారు కూడా కాలక్రమేణా ఆ పుస్తకంతో ప్రేమలో పడిపోతారు.