పిల్లలకు ట్రూ ఫ్రెండ్ గా..
ముఖేశ్ అంబానీ, ఈయన భార్య నీతా అంబానీలు పిల్లలకు కేవలం తల్లిదండ్రులుగానే కాకుండా.. వారికి బెస్ట్ ఫ్రెండ్ లా కూడా ఉంటారు. ఈ జంట తమ ముగ్గురు పిల్లలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి ఆరోగ్యకరమైన, బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను హృదయపూర్వకంగా గౌరవిస్తారు. బంధానికి విలువ తెసుకుంటారు. అందుకే అంబానీ ఫ్యామిలీకి బంధాల విలువ, ప్రాముఖ్యతలు బాగా తెలుసు. దీనివల్ల వీళ్లు భవిష్యత్తులో ప్రతి సంబంధాన్ని గౌరవిస్తారు. మీకు తెలుసా? పేరెంట్స్ పిల్లలలో ఫ్రెండ్లీగా ఉంటే.. పిల్లలు పేరెంట్స్ తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు. మనసులో ఏదీ దాచుకోరు. అలాగే ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారు.