పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే తలనొప్పి, మానసిక అలసట, ఒత్తిడికి గురవుతారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి. లేదంటే..చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి.
అంతేకాదు.. పిల్లలు ఫోన్లు వాడటం మొదలుపెడితే పిల్లలు పేరెంట్స్ కి కూడా సమస్యలు తెచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. ఆన్ లైన మోసాల బారిన పిల్లలు పడే ప్రమాదం ఉంది. ఆన్లైన్ మోసాలు , పిల్లల లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ప్రత్యేకించి, అపరిచితులతో సంభాషించకుండా ఉండమని మీకు సలహా ఇవ్వాలి. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లో గడిపితే వారికి చదువుపై ఆసక్తి ఉండదు.ఇది వారి సామాజిక జీవితానికి హానికరం.