పన్నుల ప్రభావం మద్యం రిటైల్ ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు జానీ వాకర్ రెడ్ లేబుల్ (750 మిల్లీ) ఢిల్లీలో రూ. 1400, గోవాలో రూ. 1650, బెంగళూరులో రూ. 1700, హైదరాబాదులో రూ. 2400 గా ఉంది. బ్లాక్ లేబుల్ విస్కీ ఢిల్లీలో రూ. 3310, ముంబైలో రూ. 4200, కర్ణాటకలో సుమారు రూ. 5200గా ఉంది.
ఈ భారీ ధర వ్యత్యాసం “ఒక దేశం-ఒక పన్ను” సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మద్యం పరిశ్రమ అభిప్రాయపడుతోంది. పరిశ్రమ రిపీట్ గా పన్ను వ్యవస్థలో సమగ్ర మార్పులు కోరుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని చెబుతోంది.