అయోధ్య : అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరం ఎట్టకేలకూ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని జరుపుకోబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం దగ్గరపడుతోంది. ఈ కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని.. జన్మధన్యం చేసుకోవాలనుకునేవారు చాలామందే ఉంటారు. అయితే, జనవరి 22న ఆహ్వానితులకు తప్ప వేరేవారికి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండదు.