ఉమ్రికలాన్ గ్రామంలో ఒక్కసారిగా కలకలం
వాస్తవానికి, ఉమ్రికలాన్ గ్రామంలోని ప్రజలు పొలాల దగ్గర ఐదు చిరుతలు తిరుగుతూ ఉండటం చూసి ఒక్కసారిగా కలకలం రేగింది. జ్వాలా దాని పిల్లలు ఒక రైతు మేకలను లక్ష్యంగా చేసుకున్నాయి. అక్కడే చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాయి. ఈ మొత్తం సంఘటనను గ్రామంలోని కొంతమంది యువకులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.
వైరల్ అవుతోన్న వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో సినిమా సన్నివేశానికి ఏమాత్రం తీసిపోదు. వీడియోలో జ్వాలా దాని నాలుగు పిల్లలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తున్నాయి. అప్పుడు ఒక యువకుడు వచ్చి వాటి ముందు ఒక గిన్నెలో నీళ్లు పెట్టాడు. కాసేపటి తర్వాత చిరుతలు లేచి ఎలాంటి భయం లేకుండా నీళ్లు తాగేశాయి. వైరల్ వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.