ప్రశ్న 1: UPSC ఇంటర్వ్యూయర్: మీ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి సరైనది కానీ కష్టం, మరొకటి తప్పు కానీ సులువు. మీరు ఏది ఎంచుకుంటారు?
UPSC అభ్యర్థి తెలివైన సమాధానం: నేను నా సిద్ధాంతాలను వదులుకోకుండా గమ్యానికి చేర్చే దారి ఏదైనా ఎంచుకుంటాను, అది ఎంత కష్టమైనా సరే. ఎందుకంటే పరిపాలనా సేవలో నిజాయితీ, ధైర్యమే అతిపెద్ద ఆస్తి.
ప్రశ్న 2: UPSC ఇంటర్వ్యూయర్: ఒక రైతు, ఒక నాయకుడు, ఒక అధికారి.. ఈ ముగ్గురిలో ఎవరు చాలా ముఖ్యం?
UPSC అభ్యర్థి సమాధానం: ముగ్గురూ ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటివాళ్లే. రైతు మనకు తిండి పెడతాడు, నాయకుడు దిశానిర్దేశం చేస్తాడు, అధికారి వ్యవస్థను అమలు చేస్తాడు. ఈ ముగ్గురూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది.
ప్రశ్న 3: UPSC ఇంటర్వ్యూయర్: సిస్టమ్ బలహీనంగా ఉన్నప్పుడు IAS అధికారిగా మీరు అవినీతిని ఎలా ఎదుర్కొంటారు?
UPSC అభ్యర్థి సమాధానం: సిస్టమ్లో నిజాయితీపరులు, బలమైన వ్యక్తులు ఉంటేనే అది మారుతుంది. నేను ఒక మార్పు తీసుకురాగలిగే వ్యక్తిగా వ్యవస్థలో ఉంటూ దాన్ని బలోపేతం చేయగలను.