గుర్రపుబగ్గీలో రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

Published : Jan 26, 2025, 10:45 AM ISTUpdated : Jan 26, 2025, 10:54 AM IST

india republic day: భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2025న గొప్ప వేడుకలను జ‌రుపుకుంటోంది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథంలో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి.  

PREV
13
గుర్రపుబగ్గీలో రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

Republic Day Parade 2025: జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని కర్తవ్య ప‌థ్ లో 'విరాసత్, వికాస్'ల సింబాలిక్ సంగమాన్ని, భారతదేశం తన సైనిక పరాక్రమాన్ని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తోంది.

భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2025న గొప్ప వేడుకలను జ‌రుపుకుంటోంది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథంలో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. కవాతును చూసేందుకు దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఉదయం 10:30 గంటలకు కవాతు ప్రారంభమైంది. 

23

గుర్రపుబగ్గీలో రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము 

భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జ‌రిగే రిప‌బ్లిక్ డే వేడుక‌ల గుర్ర‌పుబ‌గ్గీలో విచ్చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌ నుంచి బయలుదేరారు. రాష్ట్రప‌తితో పాటు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా ఉన్నారు. రాష్ట్రపతి అంగరక్షకులు గుర్రాలపై స్వారీ చేస్తూ గౌర‌వ‌వంద‌నంతో ముందుకుసాగారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఇక్కడకు వచ్చారు. రాష్ట్రపతికి ఆయన స్వాగతం పలికారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను నరేంద్ర మోడీ కౌగిలించుకుని గౌర‌వంగా స్వాగ‌తం ప‌లికారు. 

గణతంత్ర దినోత్సవం 2025 వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు?

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా రిపబ్లిక్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ప్రత్యేక అతిథి. సుబియాంటో పర్యటన 1950లో భారతదేశ ప్రారంభ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో అడుగుజాడల్లో భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే నాల్గవ ఇండోనేషియా అధ్యక్షుడు కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగిస్తారు.

“మా గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మీరు భారతదేశాన్ని సందర్శించడం మాకు ఎంతో గర్వకారణం. ఈవెంట్‌లో మొదటిసారిగా ఇండోనేషియా మార్చింగ్ స్క్వాడ్‌ను చూసేందుకు మేమంతా ఆసక్తిగా ఉన్నాము. మరోసారి, నేను మీకు, మీ ప్రతినిధి బృందానికి భారతదేశానికి స్వాగతం పలుకుతున్నాను” అని ప్రధాని మోడీ అంతుకుముందు వారికి స్వాగ‌తం ప‌లికారు. 

33

2025 సంవత్సరం రిప‌బ్లిక్ డే ప్రత్యేకత ఏమిటి?

కర్తవ్య పథ్ లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను వీక్షించేందుకు 600 మందికి పైగా పంచాయతీ నాయకులను ప్రత్యేక అతిథులుగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ ప్రత్యేక అతిథులు వారి సంబంధిత పంచాయతీలలో వివిధ ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌ల క్రింద లబ్దిదారుల కోసం అత్యుత్తమ సహకారం అందించినందుకు ఎంపిక చేసిన‌ట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

హర్ ఘర్ జల్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీన్), మిషన్ ఇంద్రధనుష్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్), ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి పోషణ్ యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, ప్ర‌ధాన మంత్రి విశ్వ‌కర్మ, ప్ర‌ధాన మంత్రి విశ్వ‌కర్మ వందన యోజన, ది కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకంలో సేవ‌లు అందించిన వారు ఉన్నారు. అలాగే, మొత్తం 10వేల మందిని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు.

Read more Photos on
click me!

Recommended Stories