కౌన్సిల్ పాత్ర ఏమిటి?
1957 సంవత్సరం నుండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ దేశవ్యాప్తంగా సాహసం చేసిన బాలల పేర్లను ఎంపిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం, అందులో కేంద్ర ప్రభుత్వం సహకారం కొనసాగించడం జరిగింది. ప్రభుత్వం తరపున గణతంత్ర దినోత్సవ పరేడ్కు ముందు రాష్ట్రపతి ఇంకా ప్రధానమంత్రిని కలిసే అవకాశం పిల్లలకు ఇచ్చేవారు.
అవార్డు గెలుచుకున్న పిల్లల చదువు, శిక్షణ తదితర ఖర్చులన్నీ కౌన్సిల్ భరిస్తుంటుంది. 1996 నుండి దేశంలోని ప్రతి ప్రధానమంత్రి గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో అసాధారణ విజయాలు సాధించిన 5-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలను సత్కరిస్తున్నారు. పతకంతో పాటు సర్టిఫికెట్, ప్రశంసా పత్రం, నగదు పురస్కారం కూడా అందుకుంటారు.