కరోనా కట్టడికి.. డైడెస్ క్యాడిలా బయోటెక్ ను సందర్శించిన ప్రధాని

First Published Nov 28, 2020, 2:49 PM IST

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సాగుతున్న వ్యాక్పిన్ తయారీ ప్రక్రియను పరిశీలించేందుకు దేశ ప్రధాని మోదీ బయోటెక్ పార్కులను సందర్శిస్తున్నారు. 

హైదరాబాద్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీకి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. డిసెంబర్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంకానుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన తయారీ ప్రక్రియ ఎలా సాగుతుందో పరిశీలించేందుకు శనివారం మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
undefined
ముందుగా శనివారం ఉదయమే గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. అక్కడి డైడెస్ క్యాడిలా బయోటెక్ పార్కును సందర్శించారు. ఆ సంస్థ అభివృద్ది చేసిన జైకోవ్-డి టీకా ప్రయోగాల గురించి ఆయన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్ ధర ధరించి వ్యాక్సిన్ ప్రయోగశాలను మోడీ పరిశీలించారు.
undefined

Latest Videos


ఈ వ్యాక్సిన్ ఇక్కడ ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది. అంతకు ముందు మోడీ సంస్థ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్ లతో మాట్లాడారు. మోడీ దాదాపు గంట సేపు ప్లాంటులో గడిపారు. ప్రధానిని చూసేందుకు జైడస్ బయోటెక్ పార్కు వద్దకు ప్రజలు పెద్ద యెత్తున చేరుకున్నారు వారికి మోడీ అభివాదం చేశారు. అక్కడినుండి నేరుగా హైదరాబాద్ కు చేరుకుని భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. ఆ తర్వత మహారాష్ట్రలోని పూణెకు వెళ్లి అక్కడ కూడా ఓ బయోటెక్ ను సందర్శించనున్నారు.
undefined
click me!