శోభనానికి గంట ముందు.. బంగారంతో ఇద్దరు వధువులు పరార్..!

First Published Nov 25, 2020, 12:35 PM IST

మధ్యవర్తిత్వం ద్వారా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారని.. వారు మీ అబ్బాయిలకు మంచి జోడి అంటూ నమ్మించాడు. వెంటనే.. అతను తన కొడుకులకు పెళ్లి జరుగుతోందని సంబరపడిపోయాడు.

పెళ్లి కి ముందు పెళ్లి కొడుకు నచ్చలేదని పారిపోయిన వధువులను మీరు చూసి ఉంటారు. కానీ.. ఈ అక్కాచెళ్లెళ్లు మాత్రం.. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకొని.. మరి కొద్ది గంటల్లో శోభనం అనగా.. ఇద్దరూ అత్తారింట్లో నుంచి పరారయ్యారు. ఈ సంఘటన ఆగ్రాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా.. ఆయన తన ఇద్దరు కుమారులకు పెళ్లి చేయాలని అనుకున్నాడు. అందుకోసం సంబంధాలు చూస్తుండగా.. ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.
undefined
మధ్యవర్తిత్వం ద్వారా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారని.. వారు మీ అబ్బాయిలకు మంచి జోడి అంటూ నమ్మించాడు. వెంటనే.. అతను తన కొడుకులకు పెళ్లి జరుగుతోందని సంబరపడిపోయాడు.
undefined
అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి సదరు యువతుల సోదరుడు పెళ్లికొడుకుల తండ్రి వద్దకు వచ్చాడు. పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి పెళ్లి కొడుకుల తండ్రి.. రూ.లక్ష యువతుల సోదరుడికి ఇచ్చాడు.
undefined
ఆ తర్వాత పెళ్లికి ఇరువైపులా అంగీకారం తెలపడంతో.. పెళ్లి సందడి ప్రారంభించారు. పెళ్లిరోజురానే వచ్చింది.. ఘనంగా పెళ్లి కూడా జరిపించారు.
undefined
పెళ్లి తర్వాత పెళ్లికూతుళ్లను తీసుకొని అత్తారింటికి వచ్చారు. రాత్రి 11గంటలకు పెళ్లి జరగగా.. గంటలోపు అత్తారింట్లో అడుగుపెట్టారు.ఆ తర్వాత మరికొద్ది గంటల్లో కొత్త జంటలకు శోభనం ఏర్పాట్లు కూడా చేపట్టారు.
undefined
ఈ సమయంలో.. ఇద్దరు కొత్త కోడళ్లు.. తాము టాయ్ లెట్ కి వెళ్లాలని అత్తగారిని కోరారు. వారి ఇంట్లో టాయ్ లెట్ సదుపాయం లేకపోవడంతో.. అత్తగారు దగ్గరుండి.. ఇద్దరినీ పొలాల్లోకి తీసుకువెళ్లింది.
undefined
అయితే.. నీరు సరిపోవని.. ఇంకో బకెట్ నీరు తెమ్మని కొత్త కోడలు కోరడంతో.. అత్తగారు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసిరికి ఇద్దరు కోడళ్లు కనపడలేదు. దీంతో ఆమె చాలా భయపడిపోయింది.
undefined
ఎవరైనా తమ కోడళ్లను ఎత్తుకెళ్లారా అని భయపడింది. అయితే.. అక్కడ పరిసరాలను చూడగా.. ఎవరూ ఎత్తుకువెళ్లలేదని.. ప్లాన్ ప్రకారం వారు పారిపోయారని అర్థమయ్యింది.
undefined
వారి ఒంటిపై ఉన్న బంగారంతో సహా పారిపోయినట్లు గుర్తించారు. వారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ముందుగానే వాహనం ఏర్పాటు చేసుకొని పారిపోయినట్లు తేలింది. ఆ బంగారం అత్తగారు పెట్టినదే కావడం గమనార్హం.
undefined
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే.. వీళ్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ.. పారిపోయిన వధువుల కోసం మాత్రం వెతుకుతూనే ఉన్నారు. వాళ్లు చెప్పిన అడ్రస్, పేర్లు కూడా తప్పేనని తేలడంతో పెళ్లి కొడుకు ఫ్యామిలీ ఫుల్ షాక్ లో ఉండిపోయింది.
undefined
click me!